నన్నేమీ అడక్కండి!!!
-----------------------రావెల
***********************************
ఆనవసంబాధాలనుంచి
మనసు మరచుకున్నావెందుకని
మాత్రం నన్నడక్కండి..
కొండలూ గుట్టలనూ ధ్వంసంచేసిపారేసి
ఇండ్లకు పునాదిరాళ్ళుగా పేర్చుకున్నారు..
హరితవనాలనన్నీ విధ్వంసం చేసి
రాజధానిని నిర్మిస్తున్నారు..
మట్టినేలను సైతం ఆకాశ హర్మ్యాలకోసం
మవ్శానంగామార్చి మృదుహాసాన్ని నటిస్తున్నారు..
రహదారులన్నింటినీ రణరంగాల్లా
కాలుష్యకారకాలుగా మార్చేసి శబ్దాలతో
నిండిపోయేలా చేసి ఎక్కడికయినా పారిపోదామనిపించేస్తున్నారు..
ఈ జనారణ్యాలు నివాసయోగ్యం కాదనిపించేస్తున్నారు..
ముక్కుమూసుకుని జపతపాలతో మునిగిపొవడడమే మేలనిపించేస్తున్నారు..
==================================================
నన్నేమీ అడక్కండి[2]
-----------------------రావెల
***********************************
నాముఖద్వారం అప్పిసెం
మూసే వుంటుందెందుకని మాత్రం
నన్ను ససేమిరాడగొద్దు!!
వసంతంవెల్లివిరిసిన నేలనంతటినీ
శిశిరరుతువులామార్చి ఆశలతోనిండిన
ఆకులన్నింటినీ క్రూరంగారాల్చేస్తున్నారు..
ఈ ప్రక్కన ప్రవహించే పిల్లకాలువ ఒడ్దునుసైతం
దుర్మార్గం దురాక్రమణజేసి ఇండ్లను నిర్మించుకుంటున్నారు..
పగటి చీకటితో అలమటిస్తున్న ప్రభుత్వాలకనులుగప్పి
అధికారుల తలలను అవినీతిలోముంచేసి
తమ పబ్బం గడుపుకుంటున్నారు..
ఉదయాన్నే దినపత్రికలన్నే నేర వార్తలతోనింపి
సున్నితమైన నా మనసును క్షగాత్రంగా మార్చేసి
కులుకులు నటించేస్తున్నారు..
మనిషిని కదిలిస్తే మానభంగాల
కధలే వినబడుతున్నాయి..
ఇంతకన్నా నాతలుపులు బిడాయించుకుని
కృష్ణా,రామాంటూ తత్వదర్శనాలతో
మునిగి తేలడమే మేలనిపించేస్తున్నారు..
========================================
నన్నేమీ అడక్కండి!![3]
=================రావెల
ప్రభాత సమయాన పాదచారిగా
కనిపించడంలేదని ఒక్క ప్రశ్నను
వేసి నన్ను మాత్రం విసిగించకండి..
ఇప్పటిదాకా నేను చేస్తూ వచ్చిన
దేశ సంచారాలు చాలు!
ఎక్కడ పర్యటించినా ఇక్కట్ల భారతమే
ఎదురవుతూ వస్తున్నది..
మనసు మనసులో స్థిరంగా నిలబడకుండా
చలన శీలగ మారి వేధిస్తున్నది..
కోహినూరు వజ్రాన్ని తిరిగి మనదేశానికి
ఎందుకు తేవడంలేదని కోపం
ప్రకటించగలవాళ్ళెందరు?
పంచతంత్రంలోని నీతికధలను
నిత్యం గుర్తుచేసుకుని జీవిస్తున్నవారెమందరు?
శతక సాహిత్యంలో ప్రస్ఫుటించే
ప్రసన్నమౌ వాక్యాలను గుర్తుంచుకుని
జీవితగమనాన్ని మలుచుకుంటున్నవారెందరు?
ఈ తత్వహితమైన బోధనలను
ఎవరితోపంచుకునేవీలు కలగడంలేదు..
మౌనంగా నావరకు నేను ఇంటి నాలుగు
గోడలమధ్య గోప్యంగా గుట్తుగా ఉండడమే మేలని
నిశ్శబ్ద సామ్రాజ్యంలో నివసించడమే మేలని
అనవరతం కాక్షిస్తున్నాను..
ప్రపంచదర్శనంలో ఆశించిన ప్రయోజనం
సిద్ధించడంలేదన్న యదార్ధాన్ని గ్రహించాను..
అందుకే నాయాత్రలన్నింటికీ విరామం ప్రకటించేస్తున్నాను..
===============================================
-----------------------రావెల
***********************************
ఆనవసంబాధాలనుంచి
మనసు మరచుకున్నావెందుకని
మాత్రం నన్నడక్కండి..
కొండలూ గుట్టలనూ ధ్వంసంచేసిపారేసి
ఇండ్లకు పునాదిరాళ్ళుగా పేర్చుకున్నారు..
హరితవనాలనన్నీ విధ్వంసం చేసి
రాజధానిని నిర్మిస్తున్నారు..
మట్టినేలను సైతం ఆకాశ హర్మ్యాలకోసం
మవ్శానంగామార్చి మృదుహాసాన్ని నటిస్తున్నారు..
రహదారులన్నింటినీ రణరంగాల్లా
కాలుష్యకారకాలుగా మార్చేసి శబ్దాలతో
నిండిపోయేలా చేసి ఎక్కడికయినా పారిపోదామనిపించేస్తున్నారు..
ఈ జనారణ్యాలు నివాసయోగ్యం కాదనిపించేస్తున్నారు..
ముక్కుమూసుకుని జపతపాలతో మునిగిపొవడడమే మేలనిపించేస్తున్నారు..
==================================================
నన్నేమీ అడక్కండి[2]
-----------------------రావెల
***********************************
నాముఖద్వారం అప్పిసెం
మూసే వుంటుందెందుకని మాత్రం
నన్ను ససేమిరాడగొద్దు!!
వసంతంవెల్లివిరిసిన నేలనంతటినీ
శిశిరరుతువులామార్చి ఆశలతోనిండిన
ఆకులన్నింటినీ క్రూరంగారాల్చేస్తున్నారు..
ఈ ప్రక్కన ప్రవహించే పిల్లకాలువ ఒడ్దునుసైతం
దుర్మార్గం దురాక్రమణజేసి ఇండ్లను నిర్మించుకుంటున్నారు..
పగటి చీకటితో అలమటిస్తున్న ప్రభుత్వాలకనులుగప్పి
అధికారుల తలలను అవినీతిలోముంచేసి
తమ పబ్బం గడుపుకుంటున్నారు..
ఉదయాన్నే దినపత్రికలన్నే నేర వార్తలతోనింపి
సున్నితమైన నా మనసును క్షగాత్రంగా మార్చేసి
కులుకులు నటించేస్తున్నారు..
మనిషిని కదిలిస్తే మానభంగాల
కధలే వినబడుతున్నాయి..
ఇంతకన్నా నాతలుపులు బిడాయించుకుని
కృష్ణా,రామాంటూ తత్వదర్శనాలతో
మునిగి తేలడమే మేలనిపించేస్తున్నారు..
========================================
నన్నేమీ అడక్కండి!![3]
=================రావెల
ప్రభాత సమయాన పాదచారిగా
కనిపించడంలేదని ఒక్క ప్రశ్నను
వేసి నన్ను మాత్రం విసిగించకండి..
ఇప్పటిదాకా నేను చేస్తూ వచ్చిన
దేశ సంచారాలు చాలు!
ఎక్కడ పర్యటించినా ఇక్కట్ల భారతమే
ఎదురవుతూ వస్తున్నది..
మనసు మనసులో స్థిరంగా నిలబడకుండా
చలన శీలగ మారి వేధిస్తున్నది..
కోహినూరు వజ్రాన్ని తిరిగి మనదేశానికి
ఎందుకు తేవడంలేదని కోపం
ప్రకటించగలవాళ్ళెందరు?
పంచతంత్రంలోని నీతికధలను
నిత్యం గుర్తుచేసుకుని జీవిస్తున్నవారెమందరు?
శతక సాహిత్యంలో ప్రస్ఫుటించే
ప్రసన్నమౌ వాక్యాలను గుర్తుంచుకుని
జీవితగమనాన్ని మలుచుకుంటున్నవారెందరు?
ఈ తత్వహితమైన బోధనలను
ఎవరితోపంచుకునేవీలు కలగడంలేదు..
మౌనంగా నావరకు నేను ఇంటి నాలుగు
గోడలమధ్య గోప్యంగా గుట్తుగా ఉండడమే మేలని
నిశ్శబ్ద సామ్రాజ్యంలో నివసించడమే మేలని
అనవరతం కాక్షిస్తున్నాను..
ప్రపంచదర్శనంలో ఆశించిన ప్రయోజనం
సిద్ధించడంలేదన్న యదార్ధాన్ని గ్రహించాను..
అందుకే నాయాత్రలన్నింటికీ విరామం ప్రకటించేస్తున్నాను..
===============================================